ఇల్లీగల్‌ ధనంతో రెండు భవనాల కొనుగోలు

- October 26, 2016 , by Maagulf
ఇల్లీగల్‌ ధనంతో రెండు భవనాల కొనుగోలు

మనామా: మనీ లాండరింగ్‌, అక్రమ ఫండ్‌ రైజింగ్‌ ద్వారా అక్రమంగా ఆర్జించిన ఓ క్లిరిక్‌ రెండు భవనాల్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 500,000 మరియు 560,000 బహ్రెయినీ దినార్ల విలువైన ఈ భవనాలకు సంబంధించిన వివరాల్ని ప్రాసిక్యూషన్‌ ధృవీకరించింది. ఇసా ఖాసిమ్‌, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్రమంగా పండ్‌ రైజింగ్‌ చేపట్టాడు. బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా ఈ నిధుల సమీకరణ జరిగినట్లు అభియోగాలున్నాయి. ఎవరికీ అనుమానాలు రాకుండా చిన్న చిన్న మొత్తాల్ని ఎక్కువసార్లు డిపాజిట్‌ చేసినట్లు విచారణలో తేలింది. రోజువారీ డిపాజిట్ల మ్తొం 6,000 బహ్రెయినీ దినార్లకు మించకుండా వారు జాగ్రత్తపడ్డారు. తన పేరు మీద ఇసా కాసిమ్‌ 1 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తుల్ని కూడగట్టినట్లు మిగతా ఇద్దరు వ్యక్తులు పేర్కొన్నారు. విచారణలో 10,000,000 డాలర్ల మొత్తం అతని బ్యాంకులో గతంలో జమ అయినట్లు తేలింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com