ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై తూనికలు, కొలతల శాఖ కేసు

- October 26, 2016 , by Maagulf
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై తూనికలు, కొలతల శాఖ కేసు

ప్యాకేజి వస్తువుల నియమాలు సక్రమంగా పాటించడం లేదని ప్రముఖ ఈకామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై తూనికలు, కొలతల శాఖ కేసు నమోదు చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ శాఖ అధికారులు ఈ సంస్థలకు చెందిన గిడ్డంగులపై దాడి చేసి రూ.70 లక్షల విలువ చేసే ఉత్పత్తులను సీజ్‌ చేశారు.
ప్యాకేజి నియమాలు ఉల్లంఘించిన కారణంగా ఇన్‌స్టాకార్ట్‌ వారి నుండి రూ.37లక్షల విలువ గల 18 రకాల ప్యాకేజి వస్తువులు, అమెజాన్‌ సెల్లర్స్‌ సర్వీసెస్‌ నుంచి రూ. 47.7 లక్షల విలువగల వస్తువులను సీజ్‌ చేశారు. అంతేకాకుండా వాటిపై గరిష్ఠ చిల్లర ధర, ప్యాకేజి మీద రాసిన బరువు విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com