ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్న 'కయాంత్‌'

- October 26, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్న 'కయాంత్‌'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 'కయాంత్‌' తుపాను వణికిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి క్రమంగా విశాఖ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com