మధ్య ఇటలీ లో తీవ్ర భూకంపం ...
- October 27, 2016
మధ్య ఇటలీ ప్రాంతంలో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.0గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రాణ నష్టంపై కచ్చితమైన సమాచారం లేదు. భారీ భూకంపానికి 2 గంటల ముందు 5.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. రోమ్కు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం మార్చీ ప్రాంతంలోని కాస్టిలాంజింలో సుల్నీరా పట్టణంపై తీవ్రంగా ఉంది. ఈ పట్టణంలో చాలా ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నట్లు సమాచారం. దీనికి సమీపంలోని విస్సో పట్టణంలో కొంత మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.ఒక పురాతన చర్చి ధ్వంసమైనట్లు సమాచారం. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రాంతానికి వచ్చే రహదారులను అధికారులు మూసివేశారు.భూకంప సమాచారం అందిన వెంటనే ఇటలీ ప్రధాని మాట్టీయో రెన్జీ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని సహాయక చర్యలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







