జీవన భృతి నెలకు రూ.2.5లక్షలు భర్త నుంచి కోరిన సినీనటి రంభ...
- October 27, 2016
భర్తతో తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ మంగళవారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సినీనటి రంభ బుధవారం దీనికి అనుబంధంగా మరో పిటిషన్ వేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త నుంచి నెలకు రూ.2.5 లక్షలు జీవన భృతిగా ఇప్పించాలని ఆ పిటిషన్లో ఆమె కోరారు. తనకు నెలకు రూ.1.5 లక్షలు, తన ఇద్దరు మైనర్ కుమార్తెల బాగోగుల కోసం చెరో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.5 లక్షలు ఇప్పించాలని ఆమె కోరారు. పెళ్లికి ముందు నటిగా తనకు ఆదాయం ఉండేదని, పెళ్లి తర్వాత తనకు ఆదాయమార్గం లేకుండా పోయిందని ఆమె తన పిటిషన్లో తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం దాదాపు మానేశానని, తనతో పాటు తన పిల్లల పోషణకు తగిన ఆదాయం లేదని ఆమె పేర్కొన్నారు.రంభ పెద్ద కుమార్తె లాన్య ఒక ప్రైవేటు స్కూలులో చదువుతోంది. పాపకు స్కూలు ఫీజుగా ఏడాదికి రూ.3.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. చిన్న కుమార్తె సషాకు ఏడాదిన్నర వయసు కావండంతో వైద్య ఖర్చులు అనివార్యమవుతాయి. ఆ కారణంగా తనకు, తన పిల్లలకు జీవనభృతి కల్పించాలని రంభ కోరారు.కెనడాలో ఒక ఫ్యాక్టరీకి యజమాని అయిన తన భర్త పి.ఇంద్రకుమార్ ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తారని, కుటుంబ పోషణ ఆయన విద్యుక్త ధర్మమని రంభ తన పిటిషన్లో కోర్టుకు విన్నవించారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









