విమానం బోయింగ్‌ 767 ప్రమాదానికి గురైంది...

- October 28, 2016 , by Maagulf
విమానం బోయింగ్‌ 767 ప్రమాదానికి గురైంది...

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బోయింగ్‌ 767 ప్రమాదానికి గురైంది. చికాగో విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హుటాహుటిన ప్రయాణికులు, సిబ్బంది కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. చికాగో నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో 161 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. స్వల్పంగా గాయపడిన 20 మందికి వివిద ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నట్లు చికాగో అగ్నిమాపక విభాగం అధికారి జువాన్‌ హెర్నాండెజ్‌ వెల్లడించారు. .
ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని, వారిని మియామికి మరో విమానంలో పంపిస్తామని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. టైరు పేలడం వల్ల మంటలు అంటుకున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ చెప్తుండగా.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు భావిస్తున్నామని తెలిపింది. అగ్నిమాపక విభాగం అధికారులు కూడా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి ప్రయాణికులు బయటకు వెళ్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. విమానం వద్ద నల్లని దట్టమైన పొగలు వ్యాపిస్తూ మంటలు ఎగిసిపడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com