ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది..

- October 28, 2016 , by Maagulf
ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది..

ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన ఓ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు తేలికగా మండే ద్రావకంతో దాడిచేయడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు. మృతుడు మన్‌మీత్ అలీషర్ బ్రిస్బేన్‌లోని పంజాబీ జాతీయుల్లో పేరుగాంచిన సింగర్ కావడం గమనార్హం. అకస్మాత్తుగా, అనూహ్య రీతిలో జరిగిన ఈ ఘటనతో బస్సులో మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. మరికొంతమందిని స్థానికులు రక్షించడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దిగ్భ్రాంతిని కలిగించే ఈ ఘటన వెనుక జాత్యహంకార కోణం లేదని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టివార్ట్ వెల్లడించారు. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించకపోవడంతో ప్రాణనష్టం పెరగలేదని ఆయన పేర్కొన్నారు.48 ఏళ్ల అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com