ఒమనీయుల కోసం 700 ఉద్యోగాలు
- October 29, 2016
సెబియాక్ డుక్మ్ అనే సంస్థ 700 ఉద్యోగాల్ని ఒమనీయులకు టెక్నికల్ ఫీల్డ్లో ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. మిడిల్ ఈస్ట్ ఏసియాలో అతి పెద్ద సెబియాసిక్ యాసిడ్ రిఫైనరీగా సెబియాక్ డక్మ్కి పేరుంది. సెబియాక్ డుక్మ్ చైర్మన్ షేక్ హిలాల్ అల్ మావలి, స్పెషల్ ఎకనమిక్ జోన్ డుక్మ్ (సెజాద్) ఛైర్మన్ యాహ్యా అల్ జాబ్రి ఈ మేరకు కొత్త ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేశారు. 2017 నాటికి ఇది పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ముందస్తుగా 250 మందికి అవకాశాలు కల్పిస్తామనీ, ఆ తర్వాత మొత్తం 700 మందికి అవకాశాలు కల్పిస్తామని వారు వివరించారు. బయోడీగ్రేడబుల్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లాస్టిక్స్ని తయారు చేయడంలో సెబియాసిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు. కొత్త ప్లాంట్ ద్వారా 30,000 టన్నుల యాసిడ్ని ఏడాదికి ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. చైనా, జపాన్ వంటి దేశాలకు ఎక్కువగా ఈ యాసిడ్ని ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







