వలస వ్యాపారవేత్తకి కష్టాలు
- October 29, 2016
మనామా: భారతీయ వ్యాపారవేత్త, కింగ్డమ్లో 2007 నుంచి ఇరుక్కుపోయారు. ఆయనపై ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ సమస్య వచ్చింది. తాను బహ్రెయిన్లో ట్రాప్ అయ్యాననీ, తనపై అక్రమ కేసులు బనాయించారని ఆంటోనీ గ్రేసియస్ అనే వ్యక్తి ఆరోపించారు. ట్రావెల్ బ్యాన్ నుంచి ఉపశమనం పొందేందుకు తాను 6,000 బహ్రెయిని దిర్హామ్లు చెల్లించాల్సి ఉందని వాపోయారాయన. తన కారణంగా కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందనే ఆరోపణల మీద తనపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారనీ, అయితే తాను పనిచేసిన కాలంలో ఆ కంపెనీ లాభాలతో నడిచిందని ఆయన చెప్పారు. 1991లో కంపెనీని స్థాపించిన ఆయన సొంతంగా మూడేళ్ళపాటు నడిపారు. 1994లో ఇంకొకరితో కలిసి పార్టనర్షిప్ తీసుకున్నారు. ఆ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత బాగానే నడిచినా, ఇంకో ఓనర్ జనరల్ మేనేజర్ని హైర్ చేసుకున్న తర్వాత నష్టాలు వచ్చాయని తెలిపారాయన. తాను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడాదికే ఆ సంస్థను అమ్మేశారట. వాస్తవంగా తాను ఎలాంటి సొమ్ములూ ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







