అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి..
- October 29, 2016మరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి.. పవిత్ర సంగమం దగ్గర బాణసంచా వెలుగులు మిన్నంటాయి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో దీనావళి వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం దగ్గర నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు.రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, వర్గాలు, ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకోసం ప్రతి పేదకుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి 10వేల ఆదాయం చేకూర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేద మంత్రాల నడుమ కృష్ణమ్మకు పవిత్ర హారతి ఇచ్చారు పండితులు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.ఇక హారతి అనంతరం నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా బాణం వేశారు. ఆ తర్వాత సంగమం ప్రాంతమంతా బాణసంచా వెలుగులు మిన్నంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత