తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు.
- October 29, 2016విధ అంశాలపై తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు నవంబరు మొదటి వారంలో సమావేశం కానున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నాలు, దాదాపు 46 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మించ తలపెట్టిన చైనా-పాక్ ఆర్థిక కారిడార్(సీపీసీ)పై భారత్ నిరసనతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రత సలహాదారు యాంగ్ జియేచిలు హైదరాబాద్లో సమావేశమవుతారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై అధికారికంగా చర్చలు జరుపుతారు. ప్రత్యేకించి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చికాకులపై చర్చలు జరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ