రీడింగ్పై చట్టాన్ని జపారీ చేసిన ప్రెసిడెంట్ ఖలీఫా
- October 31, 2016
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సోమవారం రీడింగ్పై చట్టాన్ని విడుదల చేశారు. 'నాలెడ్జ్ బ్రీఫ్ కేస్'ని ప్రారంభించడం ఈ చట్టం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఉద్యోగులు, తమ పని సమయాల్లోనూ చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. రీడింగ్ మెటీరియల్పై ఎలాంటి ట్యాక్స్లు ఉండవనీ, పబ్లిషింగ్ సెక్టార్కి ఊతమిచ్చేలా ఈ చట్టం రూపొందిందని అధికారులు తెలిపారు. ఎడిటర్స్, ఆథర్స్కి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ చట్టంలో వెసులుబాట్లు కల్పించారు. కాఫీ షాప్స్, షాపింగ్ మాల్స్లో వినియోగదారులకు చదువుకునేందుకు పుస్తకాల్ని అందుబాటులో ఉంచేలా ఈ చట్టం ద్వారా అవకాశం కల్పించడం గమనించదగ్గది. ప్రైవేట్ సెక్టార్, లైబ్రరీలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకూ ఈ చట్టం ఉపయోగపడుతుంది. చదవడంపై అవగాహన పెంచేందుకోసం చేపట్టే కార్యక్రమాలకు నిధుల కేటాయింపు జరిగేలా ఓ ఫండ్ని కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







