కలెక్టేరేట్లో భారీ శబ్ధంతో పేలుడు
- November 01, 2016
కేరళలోని మలప్పురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించినట్లు గుర్తించారు.
ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చిపేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును హోమియో డీఎంఓదిగా గుర్తించారు. కాగా, ఘటనా స్థలంలో కరుడు గట్టిన ఉగ్రవాది ఒసాబా బిన్ లాడెన్ ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







