థాను ను అరెస్టు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ..
- November 01, 2016
కోర్టు ఉత్తర్వు ప్రకారం అప్పు తిరిగి చెల్లించని ప్రముఖ సినీ నిర్మాత కళైపులి ఎస్. థానును ఈనెల 28లోగా అరెస్టు చేయమంటూ నాగర్కోవిల్ కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. థాను రజనీ నటించిన కబాలి సనిమాకు నిర్మాతని తెలిసిన విషయమే. నాగర్కోవిల్లోని న్యూ థియేటర్ యజమాని డేవిడ్ వద్ద సినీ నిర్మాత కళైపులి ఎస్. థాను రూ.2 లక్షలను రుణంగా తీసుకున్నాడు. సకాలంలో రుణాన్ని చెల్లించకపోవడంతో డేవిడ్ నాగర్కోవిల్ కోర్టును ఆశ్రయించాడు. 2013లో ఆ కోర్టు విచారణ జరిపి వడ్డీతో సహా రూ.2లక్షలను డేవిడ్కు నిర్మాత ఎస్. థాను చెల్లించాలని ఆదేశించింది. అయితే థాను మూడేళ్లు దాటిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం డేవిడ్కు రుణాన్ని తిరిగి చెల్లించలేదు.
దీనితో డేవిడ్ మళ్లీ నాగర్కోవిల్ కోర్టును ఆశ్రయించగా ఈ నెల 28వ తేదీలోగా థాను అరెస్టుచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







