థాను ను అరెస్టు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ..
- November 01, 2016
కోర్టు ఉత్తర్వు ప్రకారం అప్పు తిరిగి చెల్లించని ప్రముఖ సినీ నిర్మాత కళైపులి ఎస్. థానును ఈనెల 28లోగా అరెస్టు చేయమంటూ నాగర్కోవిల్ కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. థాను రజనీ నటించిన కబాలి సనిమాకు నిర్మాతని తెలిసిన విషయమే. నాగర్కోవిల్లోని న్యూ థియేటర్ యజమాని డేవిడ్ వద్ద సినీ నిర్మాత కళైపులి ఎస్. థాను రూ.2 లక్షలను రుణంగా తీసుకున్నాడు. సకాలంలో రుణాన్ని చెల్లించకపోవడంతో డేవిడ్ నాగర్కోవిల్ కోర్టును ఆశ్రయించాడు. 2013లో ఆ కోర్టు విచారణ జరిపి వడ్డీతో సహా రూ.2లక్షలను డేవిడ్కు నిర్మాత ఎస్. థాను చెల్లించాలని ఆదేశించింది. అయితే థాను మూడేళ్లు దాటిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం డేవిడ్కు రుణాన్ని తిరిగి చెల్లించలేదు.
దీనితో డేవిడ్ మళ్లీ నాగర్కోవిల్ కోర్టును ఆశ్రయించగా ఈ నెల 28వ తేదీలోగా థాను అరెస్టుచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









