భారీ డ్రగ్ రాకెట్‌ గుట్టును రట్టు...

- November 02, 2016 , by Maagulf
భారీ డ్రగ్ రాకెట్‌ గుట్టును రట్టు...

భారీ డ్రగ్ రాకెట్‌ గుట్టును రట్టు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్- డీఐఆర్. దీని విలువ అక్షరాలా మూడువేల కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో నారోటిక్ డ్రగ్స్ పట్టుబడడం దేశంలో ఇదే ఫస్ట్‌టైమ్. అక్టోబర్ 28న రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో మరుధర్ డ్రింక్స్ కంపెనీపై దాడులు చేశారు డీఆర్‌ఐ అధికారులు.నిషేధిత మ్యాండ్యాక్స్ ట్యాబ్లెట్స్ అధికంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్ల బరువు 23 వేల 500 కేజీలు. అంతర్జాతీయ మార్కెట్లో అయితే 4,500 కోట్ల రూపాయలు విలువ చేయవచ్చన్నది అంచనా! ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అదుపులోకి విచారిస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com