సెంట్రల్‌ ఇటలీలో మళ్లీ భూకంపం

- November 03, 2016 , by Maagulf
సెంట్రల్‌ ఇటలీలో మళ్లీ భూకంపం

ఇటలీ కొద్ది రోజులుగా భూకంపాలతో వణికిపోతోంది. గురువారం ఉదయం సెంట్రల్‌ ఇటలీలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5గా నమోదైంది.పెరూగియా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 200 మందికి పైగాప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటలీ కోలుకుంటున్న సమయంలో మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారంఇటలీలో 6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇటలీలోని చారిత్రక కట్టడాలు నేలకొరిగాయి. ధ్వంసమైన భవనాలు, చర్చిలను త్వరలో నిర్మిస్తామని ఇటలీ ప్రధాని మాటియో రెన్జి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com