బంగారు కుంచె కల్గిన వ్యక్తి సంపాదన డి హెచ్ 1,400 మాత్రమే

- November 03, 2016 , by Maagulf
బంగారు కుంచె కల్గిన వ్యక్తి సంపాదన డి హెచ్ 1,400 మాత్రమే

ముస్సఫహ్ సంస్థలో పనిచేస్తున్న ఒక భారతీయ వ్యక్తి తన విరామ సమయంలో కళ్ళు చెదిరే పెయింటింగులు చిత్రించి పలువుర్ని అబ్బురపర్చడమే కాక అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. 8 మంది సహచరులు ఉన్న ఒక చిన్నగదిలో ఉంటూ , కేవలం మంచం మీద పడుకొనే స్థలం ఉన్న ఆ ఖాళీ స్థలం మాత్రమే ఉంది. ఇరుకుగా ఉన్న అక్కడ కూర్చొని చిత్రకళలోఎన్నోఅద్భుతమైన రచనలు స్కెచ్లుతో అలరిస్తున్నాడు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన కుంజుమోన్ నీలకందం ఆచారి..గత ఏడాదిన్నరగా ఒక భవన నిర్మాణ వ్యాపార సంస్థలో ఒక సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇందుకు గాను వారు 1,400 డి హెచ్  జీతం ఇస్తారని పేర్కొంటూ, నేను చేస్తున్న స్థలంలో ఎక్కువ గంటల పని ఉంటుంది. ఖాళీ సమయంలో నా గది వద్ద  బొమ్మలు వేయడం ద్వారా బడలిక నుండి విముక్తిడిని అవుతానని తెలిపాడు. అంతేకాక  నేను పని చేస్తున్న సంస్థ నుండి నాకు గొప్ప మద్దతు సైతం ఉందని కేరళా రాష్ట్రం లోని అలప్పుజ జిల్లా మవెలిక్కర మున్సిపాలిటీకి చెందిన  50 ఏళ్ల కళాకారుడు కుంజుమోన్ నీలకందం ఆచారి తెలిపాడు. 8 మంది రూమ్మెట్లు   ఉన్న చిన్న గదిలో కూర్చునే  ఖాళీ మాత్రమే ఉంది కనుక, నేను నేలపై కూర్చొని లేదా మంచం మీద  పడుకుని చిత్రాలు గీస్తానని తెలిపాడు." తాను రూపందించిన పెయింటింగులలో యుఎఇ వ్యవస్థాపకుడు, దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చిత్రపటాలు సైతం ఉన్నాయితనకు ఫోటో చూసిన వెంటనే అచ్చం అదే మాదిరిగా చిత్రం గీయగల ప్రత్యేక వరం నాకు ఉందని కుంజుమోన్ నీలకందం ఆచారి తాను గీసిన చిత్రాలను " మా గల్ఫ్ డాట్ కామ్ "  ప్రతినిధికి చూపిస్తూ తెలిపారు. తాను రూపొందించిన   ఇతర పెయింటింగులు చూపించాడు  మలయాళం సినీ పరిశ్రమకు చెందిన నటులు మోహన్ లాల్, మమ్ముట్టి, కళాభవన్ మణి, కవి ఓ ఎన్ వి కురుప్, భారతదేశం యొక్క మాజీ అధ్యక్షుడు దివంగత ఎపిజె అబ్దుల్ కలాం తదితర  ప్రముఖుల చిత్తరువులు ఉన్నాయి. తన ముఖ్యమైన స్కెచ్లను అత్యద్భుతంగా వివరించే. బిడ్డని పట్టుకొని ఒక మహిళ తన చిత్రాన్ని  వెస్ట్ బెంగాల్ లోని వార్తాపత్రిక లో చూసి  ఆమె చిత్రాన్ని నా మనస్సులో ఊహించుకొని రూపొందినట్లు వివరించాడు.  తాను  ఏక బిగువున కూర్చుంటే 90 నిమిషాలలో ఏ బొమ్మైనా గీయగలనని...సమయం కుదరక రోజుకు 30 నిమిషాలు చొప్పున ప్రస్తుతం     ప్రతి మూడు రోజులకొక చిత్రం పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపాడు  నేను నా చిన్ననాటి నుంచి రచనలు చేయడం కోసం  పెన్సిల్ స్కెచ్, చమురు మరియు యాక్రిలిక్ పెయింటింగ్స్, చెక్క శిల్పం మరియు అలా కొన్ని ఇతర పదార్ధాలపై . నేను చాలా  చిత్తరువులు చేయగలనని తెలిపాడు.  ప్రస్తుతం, అతను ఈస్ట్ యొక్క బాసెలియోస్  జీవరగేసే  నేను భారతదేశం లో మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చి యొక్క రెండవ కాథోలికస్ చర్చి లలో నా పెయింటింగ్ లు ఉన్నాయని తెలిపారు.  సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ కేథడ్రల్, అబూ ధాబీ ప్రాంగణంలో ఇటీవల చెక్కపై బొమ్మలు రూపొందిస్తున్నట్లు తెలిపాడు  నేను నా కంపెనీ యజమాని నినన్ థామస్ పణికర్ కి ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నా నా అభిరుచికి తగిన విధంగా కొంత ఖాళీ సమయం అనుమతి ఇస్తున్నారని  అందుకు ప్రత్యేక  ధన్యవాదాలు తెలియచేస్తున్నాని వినయంగా పేర్కొన్నాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com