దుమ్ము, చొరబాటు గురించి పేచీ పెడుతున్న బహాయిర్ నివాసితులు

- November 03, 2016 , by Maagulf
దుమ్ము, చొరబాటు గురించి  పేచీ పెడుతున్న బహాయిర్ నివాసితులు

మనామా:  ఇసుకతో నిండుగా భారీ ట్రక్కులు,బహాయిర్ వీధులను పాడు చేస్తూ ఆ ప్రాంతంలో దుమ్ము ధూళి కాలిబాటపై వెదజల్లుతూ వెళ్లడంపై స్థానిక నివాసితులు ఆందోళన చేస్తున్నారు. భూమి పునరుద్ధరణ స్థలాల సమీపంలో నివాసితులు ఉండటంతో  భద్రతలేని లోడ్లు నడపటం వాహనాల కారణంగా ఈ ఇబ్బందికర పరిస్థితులు వారికి ఎదురవుతున్నాయి. ఈ భారీ  ట్రక్కులు దాదాపు ఓవర్లోడ్ తోనే  ఉంటాయి మరియు వారి లోడ్లు పై భాగంలో సాధారణంగా కాన్వాస్ షీట్లు పరచబడటంలేదు. ఫలితంగా, మట్టి మరియు రాళ్ల సులభంగా ట్రక్కుల నుంచి కింద పడిపోతున్నాయి. అంతేకాక  గాలిలో నుంచి దుమ్ము ధూళి .మా ఇళ్ల లోనికి ప్రవేశిస్తూ  మా ఇళ్లను పాడు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిత్యం మా తలుపులు మూసుకొని ఉండాలని వాపోతున్నారు. ఆయా స్థలాల నుండి జరుపుతున్న  త్రవ్వకాలలో మట్టి రవాణా చేసే  డ్రైవర్లు కు అధికారులు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని స్థానిక నివాసితులు పిర్యాదు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com