త్వరలో విడుదల కానున్న 'పిజ్జా-2'
- November 03, 2016
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం 'పురియత్ పుధీర్'. ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. 'ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం రూపొందించారు. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్సేతుపతికి ఈ చిత్రం ఎనిమిదో హిట్గా నిలుస్తుంది.
ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ను 48 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించడం హీరో క్రేజ్కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ను విడుదల చేసి, ఇదే నెలలో రెండు భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ.. ఆసక్తిని కలిగించే స్క్రీన్ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని దర్శకుడు రంజిత్ జయకోడి చక్కగా తీర్చిదిద్దారు' అన్నారు.
ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: శామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







