బహ్రెయిన్ ఇండియా వీక్ 2016లో కొత్త బిజినెస్ ఐడియాస్
- November 04, 2016
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరగనున్న బహ్రెయిన్ ఇండియా వీక్ 2016లో ఇరు దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొత్త కొత్త ఐడియాలతో తమ ప్రత్యేకతను చాటుకోనున్నాయి. బి 2 బి సెషన్స్, కల్చరల్ పెర్ఫామెన్సెస్ మరియు ఇతర యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో హైలైట్ కానున్నాయి. ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఇండియా - బహ్రెయిన్ మధ్య వ్యాపార సంబంధాలు మరింత మెరుగపడేందుకు ఈ ఈవెంట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న దశాబ్ద కాలంలో ఇండియా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధిస్తుందని ఆయన చెప్పారు. బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బిసిసిఐ) ఛైర్మన్ ఖాలిద్ అలమోయెద్ మాట్లాడుతూ, బహ్రెయిన్ ప్రోగ్రెస్లో ఇండియన్స్ పాత్ర ఎక్కువగా ఉండటం ఆనందదాయకమైన విషమన్నారు. ఈ సందర్భంగా భారత పార్లమెంటు సభ్యుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇరు దేశాల మధ్య స్ట్రాంగ్ ఎకనమిక్ మరియు కల్చరల్ టైస్ కోసం ఉపయోగడపాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







