'మీలో ఎవరు కోటీశ్వరుడు' యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది...

- November 05, 2016 , by Maagulf
'మీలో ఎవరు కోటీశ్వరుడు' యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది...

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్‌టైనర్‌ని చూడలేదని, సినిమా చాలా బాగుందని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.వసంత్‌ ఈచిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లోనే ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయాలని ప్లాస్‌ చేస్తున్నాం'' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com