తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేక షో

- November 06, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేక షో

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీకి మూడు వారాల ముందుగానే ఫస్టు కాఫీ చేతికి వచ్చేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది శాతకర్ణి టీమ్. అక్కడి నుంచి ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేకంగా షో వేయనున్నారని టాక్. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం కేసీఆర్ చేతుల మీదుగా జరుగగా. ఆడియో రిలీజ్ ను చంద్రబాబుతో చేయించాలని భావిస్తున్నారట బాలయ్య.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com