ఉత్తర బాగ్దాద్లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి..
- November 06, 2016
ఉత్తర బాగ్దాద్లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతులలో ఐదుగురు విద్యార్థినులు, ఒక మహిళ, ముగ్గురు పోలీసులు ఉన్నారు. చెక్పాయింట్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్ధాలు నింపిన కారుతో చెక్పాయింట్ మీదుగా దూసుకుపోయి తనను తాను పేల్చేసుకున్నట్టు సలాహుద్దీన్ ప్రావిన్స్ ప్రతినిధి అలి అల్ హందాని తెలిపారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అయితే గతంలో ఇదే తరహా దాడులకు పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అనుమానిస్తున్నారు.సున్నీ ఉగ్రవాదులు బహిరంగ ప్రదేశాల్లో పౌరులు, ఇరాక్ సెక్యూరిటీ దళాలను లక్ష్యం చేసుకుని దాడులు జరపడం పరిపాటి. బాగ్దాద్కు 130 కిలోమీటర్ల దూరంలోని తిక్రిత్ నుంచి ఐఎస్ మిలిటెంట్లను 2015 ఏప్రిల్లో ఇరాక్ దళాలు తరిమికొట్టాయి
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









