ఉత్తర బాగ్దాద్లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి..
- November 06, 2016
ఉత్తర బాగ్దాద్లోని తిక్రిత్ సిటీ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతులలో ఐదుగురు విద్యార్థినులు, ఒక మహిళ, ముగ్గురు పోలీసులు ఉన్నారు. చెక్పాయింట్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్ధాలు నింపిన కారుతో చెక్పాయింట్ మీదుగా దూసుకుపోయి తనను తాను పేల్చేసుకున్నట్టు సలాహుద్దీన్ ప్రావిన్స్ ప్రతినిధి అలి అల్ హందాని తెలిపారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అయితే గతంలో ఇదే తరహా దాడులకు పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అనుమానిస్తున్నారు.సున్నీ ఉగ్రవాదులు బహిరంగ ప్రదేశాల్లో పౌరులు, ఇరాక్ సెక్యూరిటీ దళాలను లక్ష్యం చేసుకుని దాడులు జరపడం పరిపాటి. బాగ్దాద్కు 130 కిలోమీటర్ల దూరంలోని తిక్రిత్ నుంచి ఐఎస్ మిలిటెంట్లను 2015 ఏప్రిల్లో ఇరాక్ దళాలు తరిమికొట్టాయి
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







