జమైకా పబ్లో కాల్పులు..ముగ్గురి మృతి
- November 06, 2016
జమైకాలోని ఒక పబ్లో డామినస్(వస్తువులు కనుగొనే ఆట) ఆడుతున్న నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమైకాలోని సెయింట్ కాథరిన్ పారిష్ పబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాయుధుడు వీరిపై కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియలేదు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







