జమైకా పబ్లో కాల్పులు..ముగ్గురి మృతి
- November 06, 2016
జమైకాలోని ఒక పబ్లో డామినస్(వస్తువులు కనుగొనే ఆట) ఆడుతున్న నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమైకాలోని సెయింట్ కాథరిన్ పారిష్ పబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాయుధుడు వీరిపై కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియలేదు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









