ఓటు వేయడానికి వెళ్ళేవారికి ఐసిస్ హెచ్చరిక
- November 06, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓట్లు వేయడానికి వెళ్లే ఆ దేశ పౌరులను నరికేస్తామని ఐసిస్ హెచ్చరించింది. అంతేకాకుండా ముస్లిలను ఓటింగ్ కు దూరంగా ఉండాలని కూడా కోరినట్లు యూఎస్ కు చెందిన ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూప్ పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ఉగ్రవాదులు అమెరికాలోకి చొరబడ్డారని చెప్పింది.
ఇందుకు సంబంధించిన ఏడు పేజీల మ్యానిఫెస్టోని అమెరికాలోని ఓ దినపత్రిక ప్రచురించింది. ఎన్నికల వేళ బ్యాలెట్ బాక్సులను కూడా ధ్వంసం చేయాలని ఐసిస్ ఉగ్రవాదులకు సూచించినట్లు తెలిసింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల పాలసీలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఐసిస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
దీంతో ఫెడరల్ ప్రభుత్వ సంస్ధలు ఎన్నికల రోజు దాడిపై అలర్ట్ ను ప్రకటించాయి. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్ లలో దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఫ్ బీఐ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









