వేలాది కార్డులను బ్లాక్ చేసిన టెస్కో బ్యాంక్
- November 06, 2016
బ్యాంకు మోసాల నిరోధక వ్యవస్థ అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించడంతో వేలాది కస్టమర్ కార్డులను టెస్కో బ్యాంక్ బ్లాక్ చేసింది. కొందరు ఖాతాదారులు ఆ బ్యాంకును సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు. బ్యాంకు క్లయింట్లను మోసగాళ్ళు టార్గెట్ చేసినట్లు బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు. వేలాది అకౌంట్లు మోసగాళ్ళబారినపడ్డాయని సమాచారం. తాను ఎటువంటి లావాదేవీలు జరపకుండానే తన అకౌంట్ బ్యాలెన్స్ 700 పౌండ్లు తగ్గిపోయిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మరొకామె మరింత బాధాకరమైన విషయాన్ని వెల్లడించారు. రేపు నా పిల్లలకు భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండా నా ఖాతాలో డబ్బును ఊడ్చేశారని తెలిపారు.
తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఈ-మెయిల్ కానీ, మెసేజ్ కానీ లేకుండానే మా ఖాతాల్లో డబ్బులన్నీ పోయాయని వేలాదిమంది గగ్గోలు పెడుతున్నారు. దీనిపై టెస్కో బ్యాంక్ ఆదివారం ఉదయం స్పందించింది. మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టెస్కోబ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. హ్యాక్కు గురైనట్లు అనుమానం ఉన్న కస్టమర్లందరూ వెంటనే తమను సంప్రదించాలని కోరింది.
కొన్ని ఖాతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తమ ఫ్రాడ్ ప్రివెన్షన్ సిస్టమ్ గుర్తించిందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా కొందరు ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేశామని, వారికి సందేశాలు పంపించామని వివరించింది. ఈ బ్యాంకు 1997లో ప్రారంభమైంది. 2008 నుంచి టెస్కో పీఎల్సీ యాజమాన్యంలో నడుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు దాదాపు 78 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









