వేలాది కార్డులను బ్లాక్ చేసిన టెస్కో బ్యాంక్
- November 06, 2016
బ్యాంకు మోసాల నిరోధక వ్యవస్థ అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించడంతో వేలాది కస్టమర్ కార్డులను టెస్కో బ్యాంక్ బ్లాక్ చేసింది. కొందరు ఖాతాదారులు ఆ బ్యాంకును సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు. బ్యాంకు క్లయింట్లను మోసగాళ్ళు టార్గెట్ చేసినట్లు బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు. వేలాది అకౌంట్లు మోసగాళ్ళబారినపడ్డాయని సమాచారం. తాను ఎటువంటి లావాదేవీలు జరపకుండానే తన అకౌంట్ బ్యాలెన్స్ 700 పౌండ్లు తగ్గిపోయిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మరొకామె మరింత బాధాకరమైన విషయాన్ని వెల్లడించారు. రేపు నా పిల్లలకు భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండా నా ఖాతాలో డబ్బును ఊడ్చేశారని తెలిపారు.
తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఈ-మెయిల్ కానీ, మెసేజ్ కానీ లేకుండానే మా ఖాతాల్లో డబ్బులన్నీ పోయాయని వేలాదిమంది గగ్గోలు పెడుతున్నారు. దీనిపై టెస్కో బ్యాంక్ ఆదివారం ఉదయం స్పందించింది. మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టెస్కోబ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. హ్యాక్కు గురైనట్లు అనుమానం ఉన్న కస్టమర్లందరూ వెంటనే తమను సంప్రదించాలని కోరింది.
కొన్ని ఖాతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తమ ఫ్రాడ్ ప్రివెన్షన్ సిస్టమ్ గుర్తించిందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా కొందరు ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేశామని, వారికి సందేశాలు పంపించామని వివరించింది. ఈ బ్యాంకు 1997లో ప్రారంభమైంది. 2008 నుంచి టెస్కో పీఎల్సీ యాజమాన్యంలో నడుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు దాదాపు 78 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







