వేలాది కార్డులను బ్లాక్ చేసిన టెస్కో బ్యాంక్
- November 06, 2016
బ్యాంకు మోసాల నిరోధక వ్యవస్థ అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించడంతో వేలాది కస్టమర్ కార్డులను టెస్కో బ్యాంక్ బ్లాక్ చేసింది. కొందరు ఖాతాదారులు ఆ బ్యాంకును సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు. బ్యాంకు క్లయింట్లను మోసగాళ్ళు టార్గెట్ చేసినట్లు బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు. వేలాది అకౌంట్లు మోసగాళ్ళబారినపడ్డాయని సమాచారం. తాను ఎటువంటి లావాదేవీలు జరపకుండానే తన అకౌంట్ బ్యాలెన్స్ 700 పౌండ్లు తగ్గిపోయిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మరొకామె మరింత బాధాకరమైన విషయాన్ని వెల్లడించారు. రేపు నా పిల్లలకు భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండా నా ఖాతాలో డబ్బును ఊడ్చేశారని తెలిపారు.
తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఈ-మెయిల్ కానీ, మెసేజ్ కానీ లేకుండానే మా ఖాతాల్లో డబ్బులన్నీ పోయాయని వేలాదిమంది గగ్గోలు పెడుతున్నారు. దీనిపై టెస్కో బ్యాంక్ ఆదివారం ఉదయం స్పందించింది. మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టెస్కోబ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. హ్యాక్కు గురైనట్లు అనుమానం ఉన్న కస్టమర్లందరూ వెంటనే తమను సంప్రదించాలని కోరింది.
కొన్ని ఖాతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తమ ఫ్రాడ్ ప్రివెన్షన్ సిస్టమ్ గుర్తించిందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా కొందరు ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేశామని, వారికి సందేశాలు పంపించామని వివరించింది. ఈ బ్యాంకు 1997లో ప్రారంభమైంది. 2008 నుంచి టెస్కో పీఎల్సీ యాజమాన్యంలో నడుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు దాదాపు 78 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









