500 డ్రోన్లతో ఆకాశంలో లైట్ షో జరిపి ఇన్టెల్ సంస్థ గిన్నిస్ రికార్డు సృష్టించింది..
- November 06, 2016
ఒకేసారి 500 డ్రోన్లతో ఆకాశంలో లైట్ షో జరిపి ఇన్టెల్ సంస్థ గిన్నిస్ రికార్డు సృష్టించింది. జర్మనీలోని బెర్లిన్లో ఈ ప్రదర్శన జరిగింది. రాత్రిపూట ఫుట్బాల్ మైదానంలో ఈ డ్రోన్లను ఎగురవేసి.. ఒక ల్యాప్టాప్ ద్వారా వీటిని నియంత్రించారు. అన్ని డ్రోన్లు సమన్వయంతో ఆకాశంలో వివిధ ఆకారాలను ఏర్పరుస్తూ వీక్షకులు కనులవిందు చేశాయి. ఒకేసారి అత్యధిక మానవరహిత వైమానిక వాహనాలను ఎగురవేసినందుకుగానూ ఈ ప్రదర్శన రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంటున్నట్లు గిన్నిస్ ప్రతినిధి లెనా కుల్మాన్ ప్రకటించారు. 2015లో 100 డ్రోన్లతో గతంలో తాము సృష్టించిన రికార్డును తాజా ప్రదర్శనతో ఇంటెల్ మళ్లీ తిరగరాసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







