500 డ్రోన్లతో ఆకాశంలో లైట్‌ షో జరిపి ఇన్‌టెల్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది..

- November 06, 2016 , by Maagulf
500 డ్రోన్లతో ఆకాశంలో లైట్‌ షో జరిపి ఇన్‌టెల్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది..

ఒకేసారి 500 డ్రోన్లతో ఆకాశంలో లైట్‌ షో జరిపి ఇన్‌టెల్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. జర్మనీలోని బెర్లిన్‌లో ఈ ప్రదర్శన జరిగింది. రాత్రిపూట ఫుట్‌బాల్‌ మైదానంలో ఈ డ్రోన్లను ఎగురవేసి.. ఒక ల్యాప్‌టాప్‌ ద్వారా వీటిని నియంత్రించారు. అన్ని డ్రోన్లు సమన్వయంతో ఆకాశంలో వివిధ ఆకారాలను ఏర్పరుస్తూ వీక్షకులు కనులవిందు చేశాయి. ఒకేసారి అత్యధిక మానవరహిత వైమానిక వాహనాలను ఎగురవేసినందుకుగానూ ఈ ప్రదర్శన రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంటున్నట్లు గిన్నిస్‌ ప్రతినిధి లెనా కుల్‌మాన్‌ ప్రకటించారు. 2015లో 100 డ్రోన్లతో గతంలో తాము సృష్టించిన రికార్డును తాజా ప్రదర్శనతో ఇంటెల్‌ మళ్లీ తిరగరాసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com