భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్
- November 07, 2016
భారత రాయబార కార్యాలయాలకు చెందిన ఏడు వెబ్సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, లిబియా, మలావీ, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రొమేనియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ దేశాల్లో పని చేస్తున్న సుమారు 800 మంది భారత అధికారుల వ్యక్తిగత వివరాల డేటా చోరీ చేసినట్లు నెదర్లాండ్కు చెందిన ఇద్దరు ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారతీయ అధికారుల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్పోర్ట్ నెంబర్లు, వెబ్సైట్ల అడ్మిన్, లాగిన్ వివరాలను పేస్ట్బిన్.కామ్లో బహిర్గతం చేశారు. అయితే ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఆ డేటాను తర్వాత తొలగించారు. భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ల సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకే తాము హ్యాకింగ్ చేసినట్లు గ్రేహ్యాట్స్గా చెబుతున్న ఇద్దరు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







