భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్
- November 07, 2016
భారత రాయబార కార్యాలయాలకు చెందిన ఏడు వెబ్సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, లిబియా, మలావీ, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రొమేనియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ దేశాల్లో పని చేస్తున్న సుమారు 800 మంది భారత అధికారుల వ్యక్తిగత వివరాల డేటా చోరీ చేసినట్లు నెదర్లాండ్కు చెందిన ఇద్దరు ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారతీయ అధికారుల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్పోర్ట్ నెంబర్లు, వెబ్సైట్ల అడ్మిన్, లాగిన్ వివరాలను పేస్ట్బిన్.కామ్లో బహిర్గతం చేశారు. అయితే ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఆ డేటాను తర్వాత తొలగించారు. భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ల సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకే తాము హ్యాకింగ్ చేసినట్లు గ్రేహ్యాట్స్గా చెబుతున్న ఇద్దరు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!









