భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్
- November 07, 2016
భారత రాయబార కార్యాలయాలకు చెందిన ఏడు వెబ్సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, లిబియా, మలావీ, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రొమేనియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ దేశాల్లో పని చేస్తున్న సుమారు 800 మంది భారత అధికారుల వ్యక్తిగత వివరాల డేటా చోరీ చేసినట్లు నెదర్లాండ్కు చెందిన ఇద్దరు ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారతీయ అధికారుల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్పోర్ట్ నెంబర్లు, వెబ్సైట్ల అడ్మిన్, లాగిన్ వివరాలను పేస్ట్బిన్.కామ్లో బహిర్గతం చేశారు. అయితే ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఆ డేటాను తర్వాత తొలగించారు. భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ల సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకే తాము హ్యాకింగ్ చేసినట్లు గ్రేహ్యాట్స్గా చెబుతున్న ఇద్దరు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









