ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా
- November 08, 2016
మనామా: సోషల్ మీడియా కొత్తగా రాజకీయాలకు ప్రమోటర్గా మారనుంది. ఓటర్లను ఆకర్షించేందుకుగాను నాయకులు సోషల్ మీడియాని ఆశ్రయించడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్గా మారింది. ప్రమోషనల్ ప్లాట్ఫామ్ని కూడా పలు సోషల్ మీడియా సంస్థలు ఏర్పాటు చేస్తూ, దానికోసం పెద్ద మొత్తాల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. 10,000 కువైటీ దినార్స్ నుంచి 60,000 కువైటీ దినార్స్ వరకూ ఇందుకోసం రాజకీయ నాయకులు లేదా పార్టీలు చెల్లించవలసి ఉంటుంది. అలా చేసినవారికోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ తయారుచేయించే బాధ్యతను ఆయా సంస్థలే తమ భుజాన వేసుకుంటాయి. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగిస్తున్నవారిని ఈ పొలిటికల్ అప్లికేషన్స్ ద్వారా నాయకులు ఎట్రాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రచార రంగంలో ఇదొక కొత్త ఒరవడి అని సాంకేతిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో వైపున ఓటర్లు నవంబర్ 26న పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగనుండడంతో అభ్యర్థులు, డబ్బుని వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారిక వర్గాలు అన్ని కోణాల్లోనూ అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. నాయకులు నిర్వహఙంచే సమావేశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







