ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా

- November 08, 2016 , by Maagulf
ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా

మనామా: సోషల్‌ మీడియా కొత్తగా రాజకీయాలకు ప్రమోటర్‌గా మారనుంది. ఓటర్లను ఆకర్షించేందుకుగాను నాయకులు సోషల్‌ మీడియాని ఆశ్రయించడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌గా మారింది. ప్రమోషనల్‌ ప్లాట్‌ఫామ్‌ని కూడా పలు సోషల్‌ మీడియా సంస్థలు ఏర్పాటు చేస్తూ, దానికోసం పెద్ద మొత్తాల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. 10,000 కువైటీ దినార్స్‌ నుంచి 60,000 కువైటీ దినార్స్‌ వరకూ ఇందుకోసం రాజకీయ నాయకులు లేదా పార్టీలు చెల్లించవలసి ఉంటుంది. అలా చేసినవారికోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్‌ తయారుచేయించే బాధ్యతను ఆయా సంస్థలే తమ భుజాన వేసుకుంటాయి. మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా సోషల్‌ మీడియాని ఎక్కువగా వినియోగిస్తున్నవారిని ఈ పొలిటికల్‌ అప్లికేషన్స్‌ ద్వారా నాయకులు ఎట్రాక్ట్‌ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రచార రంగంలో ఇదొక కొత్త ఒరవడి అని సాంకేతిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో వైపున ఓటర్లు నవంబర్‌ 26న పార్లమెంటరీ ఎలక్షన్స్‌ జరగనుండడంతో అభ్యర్థులు, డబ్బుని వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారిక వర్గాలు అన్ని కోణాల్లోనూ అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. నాయకులు నిర్వహఙంచే సమావేశాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com