ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా
- November 08, 2016
మనామా: సోషల్ మీడియా కొత్తగా రాజకీయాలకు ప్రమోటర్గా మారనుంది. ఓటర్లను ఆకర్షించేందుకుగాను నాయకులు సోషల్ మీడియాని ఆశ్రయించడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్గా మారింది. ప్రమోషనల్ ప్లాట్ఫామ్ని కూడా పలు సోషల్ మీడియా సంస్థలు ఏర్పాటు చేస్తూ, దానికోసం పెద్ద మొత్తాల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. 10,000 కువైటీ దినార్స్ నుంచి 60,000 కువైటీ దినార్స్ వరకూ ఇందుకోసం రాజకీయ నాయకులు లేదా పార్టీలు చెల్లించవలసి ఉంటుంది. అలా చేసినవారికోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ తయారుచేయించే బాధ్యతను ఆయా సంస్థలే తమ భుజాన వేసుకుంటాయి. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగిస్తున్నవారిని ఈ పొలిటికల్ అప్లికేషన్స్ ద్వారా నాయకులు ఎట్రాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రచార రంగంలో ఇదొక కొత్త ఒరవడి అని సాంకేతిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో వైపున ఓటర్లు నవంబర్ 26న పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగనుండడంతో అభ్యర్థులు, డబ్బుని వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారిక వర్గాలు అన్ని కోణాల్లోనూ అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. నాయకులు నిర్వహఙంచే సమావేశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









