మెరుగైన సేవలపై కొత్త రాయబారి హామీ
- November 08, 2016
భారతీయ వలసదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని భారతీయ రాయబారి కుమరన్ చెప్పారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ సహా పలు భారతీయ సంఘాలుఏ ఆయన్ను కలిశాయి. ఈ సందర్భంగా 2017 జనవరిలో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ సెలబ్రేషన్స్పైన కూడా పలువురు, కుమరన్కి విజ్ఞప్తులందించారు. మూడు నాలుగేళ్ళుగా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు, కుమరన్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని, దోహాలో మరో చోట కొత్తగా కాన్సురల్ సర్వీసులు అందుబాటులో ఉండేలా చేస్తానని కుమరన్ ఈ సందర్భంగా తెలిపారు. దోహాలోని అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంతోపాటుగా, అల్ కోర్ మరియు ఇండస్ట్రియల్ ఏరియా కూడా పరిశీలనలో ఉంది. ప్రవాసీ భారతీయ దివస్ కోసం 75 మంది బెంగళూరుకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు కుమరన్కి తెలియజేశారు. అలాగే కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్గ్రేడింగ్ సర్వీసులపైన కూడా కొందరు విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని దుబాయ్లో క్యాంపస్లను నిర్వహిస్తున్నాయనీ, అలాగే గల్ఫ్లోని ఇతర దేశాల్లోనూ క్యాంపస్లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాల్సిందిగా విజ్ఞప్తులను అందుకున్న కుమరన్, వాటిని హయ్యర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







