రోడ్డు ప్రమాదంలో వలసదారుడి మృతి
- November 09, 2016
దోహాలోని అల్ హిలాల్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ వలసదారుడు మృతి చెందాడు. 30 ఏళ్ళకు పైగా స్వదేశానికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయిన ఆ వలసదారుడి జీవితం విషాదాంతమైంది. 74 ఏళ్ళ షేక్ మొహమ్మద్ రౌతర్ దావూద్ సాహిబ్ హాజా మొహిద్దీన్, నాలుగు దశాబ్దాలుగా ఖతార్లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం అతని ప్రాణాల్ని బలికొంది. యజమాని ఇంటికి దగ్గర్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోగల తిరువారూర్ తాలూకా నుంచి దావూద్ సాహిబ్, దోహాకి వచ్చాడు. 2018లో అతని పాస్పోర్ట్ గడువు తీరనుంది. అతనికి స్పాన్సరర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి, ఇండియన్ కమ్యూనిటీని ఆశ్రయించారు బాధితుడి కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు. 1980లో ఓసారి మాత్రమే ఓసారి ఆయన ఇండియాకి వెళ్ళినట్లు తెలియవస్తోంది. మరో ఘటనలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తంజావూరుకి చెందిన మరో భారతీయ వలస కార్మికుడు 14 ఏళ్ళుగా స్వదేశానికి వెళ్ళలేక ఖతార్లోనే ప్రాణాలు విడిచాడు హార్ట్ ఎటాక్తో.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









