జక్కన్న సోదరుడి "కాట్చి నేరం"
- November 11, 2016
ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్న ఎస్ఎస్ కంచి ప్రస్తుతం తమిళంలో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. పలు తెలుగు చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన ఆయన దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. రమా రీల్స్ సంస్థ బ్యానరుపై సుధీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణధీర్, మీరా, కార్తిక్, సత్య, అబ్జిత్ శర్మ తదితరులు నటిస్తున్నారు. కె.భూపతి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. మరగదమణి (కీరవాణి) సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ నేటి యువతరం కొన్ని విషయాల్లో పెడదారి పడుతోంది. వాటిపై అవగాహన కల్పించే చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం. ఓ ఆధునిక దంపతుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. బాగా చదువుకుని మొరటు రౌడీలుగా మారిన నలుగురు యువకుల వల్ల.. ఆ కొత్త దంపతులకు పలు సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏమైందన్నదే చిత్ర కథ. ఇది నేటితరం యువకులకు, తల్లిదండ్రులకు చక్కని సందేశాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







