విచారణలో శాండిల్వుడ్ విషాదం
- November 11, 2016
శాండిల్వుడ్లో స్టంట్ మాస్టర్ల మృతితో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. రిజర్వాయర్ నుంచి రెండో మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదుకాగా... కర్ణాటక ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. ఇటు ఫిల్మ్ చాంబర్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తప్పవని ప్రకటించింది.
షూటింగ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మాస్టర్ల మృతితో శాండిల్వుడ్లో విషాదం నెలకొంది. అనుకోని ప్రమాదంతో ఇద్దరు చనిపోవడంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగింది.
రిజర్వాయర్లో కనిపించకుండా పోయిన అనిల్ డెడ్బాడీ కూడా దొరికింది. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. అతడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి సొంత ఊళ్లలో అనిల్, ఉదయ్ల అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముమ్మాటికీ ఈ సంఘటన నిర్లక్ష్యమేనన్న సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు. ఇటు పోలీసులు కూడా నిర్మాత, డైరెక్టర్, స్టంట్ మాస్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫిల్మ్ చాంబర్ కూడా ప్రమాదంపై స్పందించింది. నిర్లక్ష్యంతోనే ఇద్దరి ప్రాణాలు పోయాయని... రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దీనికి బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకొంటామని ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







