అమ్నెస్టీని వినియోగించుకోవాల్సిందిగా ఇండియన్ ఎంబసీ సూచన
- November 11, 2016
ఇండియన్ అంబాసిడర్ పి.కుమరన్, అక్రమ నివాసితులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహిస్తోన్న అమ్నెస్టీని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడు నెలల అమ్నెస్టీని సెప్టెంబర్ 2న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమ నివాసితులు ఖతార్ని విడిచిపెట్టాల్సి ఉంది. ఈ స్కీమ్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇండియన్ ఎంబసీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కుమరన్ ప్రెస్మీట్లో చెప్పారు. ఇప్పటిదాకా 1,500 మంది భారతీయులు అమ్నెస్టీని వినియోగించుకున్నారనీ, ఇందులో 150 మందికి పాస్పోర్టులు లేవన్నారు. అవసరమైనవారందరికీ ఎంబసీ అత్యవసర పాసుల్ని మంజూరు చేసిందన్నారు. ఎమర్జన్సీ పాసుల కోసం వసూలు చేయాల్సిన 60 ఖతారీ రియాల్స్ని మినహాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాగే 500, 1000 రూపాయల నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా, అలాంటి నోట్ల విషయమై ఖతార్లోనివారికి సమాచారం ఇచ్చేందుకుగాను భారత ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ కోసం ఎదురుచూస్తోంది ఎంబసీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







