విమానంలో బాంబు ఉందని బెదిరించిన భారతీయుడు

- November 11, 2016 , by Maagulf
విమానంలో బాంబు ఉందని బెదిరించిన భారతీయుడు

ఎక్కాల్సిన విమానం ఎక్కడ మిస్ అవుతుందోనని భారత్‌కు చెందిన ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. తెలివికి జోహార్లంటూ కటకటాల వెనక్కు పంపించారు అధికారులు.  ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 34 లక్షల జరిమానా కూడా విధించారు.  వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్ మోంట్రాక్స్‌లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ భారతీయుడు మాస్కోకి చెందిన విమానంలో ప్రయాణించాల్సి ఉంది.  ఏదో కారణం వల్ల విమానాశ్రయానికి రావడం లేటయింది.  ఎక్కడ విమానం వెళ్ళపోతుందోనని భయపడి విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు.  సమాచారం అందుకున్న సిబ్బంది 116 మంది ప్రయాణీకులు ఉన్న ఆ విమానాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.  విమానంలో ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అది బెదిరింపు కాల్ అని భావించి విచారణ జరిపారు.  విచారణంలో భారతీయుని సమాధానం విని ఖంగుతిన్నారు. అందుకే భారీ జరిమానా విధించారు.  బెదిరింపు కాల్ రాగానే హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్న 101 పోలీసు అధికారులకు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లకు అతడు కట్టే జరిమానాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రయాణీకుల భద్రత తమ బాధ్యత అని, ఇటువంటి బెదిరింపు కాల్స్ చేసే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com