విమానంలో బాంబు ఉందని బెదిరించిన భారతీయుడు
- November 11, 2016
ఎక్కాల్సిన విమానం ఎక్కడ మిస్ అవుతుందోనని భారత్కు చెందిన ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. తెలివికి జోహార్లంటూ కటకటాల వెనక్కు పంపించారు అధికారులు. ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 34 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్ మోంట్రాక్స్లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ భారతీయుడు మాస్కోకి చెందిన విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ఏదో కారణం వల్ల విమానాశ్రయానికి రావడం లేటయింది. ఎక్కడ విమానం వెళ్ళపోతుందోనని భయపడి విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న సిబ్బంది 116 మంది ప్రయాణీకులు ఉన్న ఆ విమానాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అది బెదిరింపు కాల్ అని భావించి విచారణ జరిపారు. విచారణంలో భారతీయుని సమాధానం విని ఖంగుతిన్నారు. అందుకే భారీ జరిమానా విధించారు. బెదిరింపు కాల్ రాగానే హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్న 101 పోలీసు అధికారులకు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లకు అతడు కట్టే జరిమానాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రత తమ బాధ్యత అని, ఇటువంటి బెదిరింపు కాల్స్ చేసే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







