నాగ్ తో సినిమా తీయనున్న చందు
- November 11, 2016
న్యూటాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు నాగార్జున. అందుకే టాలీవుడ్లో డైరెక్టర్ కావాలని ఆశపడే వాళ్లదృష్టి ముందుపడేది నాగార్జున మీదే! నాగ చైతన్య రీసెంట్గా హిట్ కొట్టిన 'ప్రేమమ్' డైరెక్టర్ చందూ మొండేటి, ఎప్పుడో నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేశాడు. కానీ అనుకోకుండా నిఖిల్ హీరోగా 'కార్తికేయ'మూవీతో డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఇక నెక్స్ట్ నాగ్తో చేయాలని ప్లాన్ చేశాడు. ఈలోగా చందూ టాలెంట్ నచ్చిన నాగ్, ప్రేమమ్ రీమేక్ చేయమని ఆఫర్ ఇచ్చాడు.
ఇప్పుడు ఎన్టీఆర్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు జరిపాడట ఈ దర్శకుడు. కానీ తన థర్డ్ మూవీ నాగార్జునతో చేయబోతున్నాడని సమాచారం.
రీసెంట్గా చందూ తనవద్దనున్న స్టోరీని ఈ హీరోకి చెప్పడం, మన్మధుడికి నచ్చేయడం అంతా జరిగిపోయిందని టాక్. ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడట. మొత్తానికి చాలాగ్యాప్ తర్వాత మళ్ళీ పోలీస్ గెటప్లో కనిపిస్తాడట నాగ్. వాసుదేవరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభంకానుందని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







