నలుగురు బలూచిస్థాన్ యువకులను ఎన్‌కౌంటర్ చేసిన పాక్

- November 13, 2016 , by Maagulf
నలుగురు బలూచిస్థాన్ యువకులను ఎన్‌కౌంటర్ చేసిన పాక్

స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతోన్న బలూచిస్థాన్ ప్రజలపై పాకిస్థాన్ అరచాకాలు ఆగడం లేదు. తాజాగా నలుగురిని పాక్ సైన్యం ఎన్‌కౌంటర్ చేసింది. మృతుల్లో 14 ఏళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. ఏడాది, రెండేళ్ళ కిందట ఇళ్ళ నుంచి ఈ యువకులను కిడ్నాప్ చేసిన పాక్ సైన్యం ఇటీవల కాల్చి చంపింది. మృతదేహాలను ఆసుపత్రికి అప్పగించింది. 2016 అక్టోబర్ నుంచి 210 మంది అదృశ్యం కాగా ఇప్పటి వరకు 57 మంది పాక్ సైన్యం చేతుల్లో మృతి చెందినట్లు బలూచ్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com