రీసైక్లింగ్ ప్లాంట్ యంత్రం మధ్య నలిగి దుర్మరణం చెందిన కార్మికుడు

- November 13, 2016 , by Maagulf
రీసైక్లింగ్ ప్లాంట్ యంత్రం మధ్య నలిగి దుర్మరణం చెందిన కార్మికుడు

ప్లాస్టిక్ ను కరిగించి మరలా పునరుత్పత్తి చేసే ఒక ప్లాంట్ లో యంత్రం మధ్య ఒక నిర్వహణ కార్మికుడు  ఇరుక్కొని లోపల నలిగి కరిగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

మారియన్ కౌంటీ కరోనీర్స్ కార్యాలయం తెలిపిన సమాచారం ప్రకారం మైఖేల్ అనే కార్మికుడు కాలిపోయి చనిపోయాడు అతని తల, శరీరం మొత్తం ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్రవంలో కరిగిపోయి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనగా తెలిపారు.ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 31 ఏళ్ల  మైఖేల్ అనే కార్మికుడు గురువారం ఆ యంత్రాల నిర్వహణ సమయంలో అకస్మాత్తుగా యంత్రం మొదలై ఆ కార్మికుని లోపలకు లాక్కొనినట్లు చెప్పారు. అధికారులు కార్మికుని మరణంపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇండియానాపోలిస్ స్టార్ ప్లాంట్ జనరల్ మేనేజర్ ఫ్రెడ్ రీడ్ నివేదిక ప్రకారం, ఈ యంత్రం పాత ప్లాస్టిక్ ను దట్టమైన గుళికలుగా మెత్తటి చూర్ణంగా చేస్తుందని, దాంతో తెలికైన ప్లాస్టిక్ చిత్రాన్ని ఫ్రేమ్లను మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువుల తయారీకి వాటిని ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com