ఖతార్ నుంచి బహ్రెయిన్కి ఫెర్రీ: వచ్చే ఏడాదిలో
- November 14, 2016
స్థానిక సంస్థ ఒకటి, తొలి ప్యాసింజర్ మరియు వెహికిల్ ఫెర్రీని పర్యాటకుల్ని ఆకర్షించేందుకుగాను ఖతార్ - బహ్రెయిన్ మధ్య నడపడానికి యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ ఫెర్రీ అందుబాటులోకి రావొచ్చు. ఖతార్లోని అల్ రువాయిస్ పోర్ట్ నుంచి బహ్రెయిన్లోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ వరకు ఈ ఫెర్రీ నడవనుంది. ఈ ఫెర్రీలో కొన్ని పర్సనల్ అలాగే కమర్షియల్ వెహికిల్స్ని కూడా తీసుకెళ్ళే అవకాశముంది. ఈ తరహాలో ఇదే గల్ఫ్ దేశాల్లో తొలి ఫెర్రీ కానుందని సమాచారమ్. బహ్రెయిన్ నుంచి ఖతార్ వెళ్ళేందుకు రోడ్డు మార్గంలో 4.5 గంటల సమయం పట్టనుండగా, ఫెర్రీ ద్వారా కేవలం 1.5 నుంచి 2.5 గంటల్లోనే చేరుకునే అవకాశముంటుంది. ఖతార్ - బహ్రెయిన్ మధ్య దూరం తగ్గించేందుకు కాజ్వే నిర్మాణం జరపాలనే యోచన చేసినప్పటికీ కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. బహ్రెయిన్కి వెళ్ళే ఫెర్రీ సక్సెస్ అయితే, ఖతార్ నుంచి యూఏఈకి కూడా భవిష్యత్తులో ఫెర్రీలు నడిపే అవకాశం ఉంటుంది. గతంలో ఓ కమర&ఇషయల్ ఫెర్రీ ఖతార్ మరియు ఇరాన్ మధ్య నడిచినా, కొన్ని అనివార్య కారణాలతో కొంత కాలం క్రితమే ఆ సర్వీస్ రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







