దుబాయ్ బస్సుల్లో ఉచిత వైఫై
- November 14, 2016
దుబాయ్ తాజాగా ఉచిత వైఫై సేవల్ని 106 ఇంటర్సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసింది. షార్జా నుంచి అబుదాబీకి నడిచే బస్సుల్లో ఈ సౌకర్యం కల్పించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఈ విషయమ్మీద స్పందిస్తూ, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఈ ఉచిత వైఫైని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్టు భాగంగా ఉచిత వైఫై సేవల్ని బస్సుల్లో అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఈ వైఫైని వినియోగించుకోవచ్చు. ఎటిసలాట్తో కలిసి ఈ ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సిఇఓ అబ్దుల్లా యూసెఫ్ అలీ వివరించారు. ఈ సేవల్ని మరింత విస్తరించనున్నట్లు చెప్పారాయన. హైస్పీడ్ ఇంటర్నెట్ని ప్రయాణీకులు వినియోగించుకుని, తమ ప్రయాణాన్ని ఇంకా ఆహ్లాదభరితంగా మార్చుకోవచ్చని ఎటిసలాట్ బిజినెస్ సెక్టార్ సిఇఓ సల్వాడోర్ అంజ్లాడా చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







