తగ్గిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు
- November 15, 2016
కేంద్ర ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లను రద్దుచేయాలని నిర్ణయించడంతో దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇళ్ల కంటే, సెకండ్ హ్యాండ్ ఇళ్ల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇలా కొనేటప్పుడు అందులో కొంత మొత్తం మాత్రమే రుణంగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం సర్వసాధారణం. ఇలా నగదు రూపంలో ఇచ్చేదాన్నే 'నల్లడబ్బు'గా పరిగణిస్తారు. అయితే, ఇప్పుడు ఇలా ఇవ్వడానికి కొత్త నోట్లతో కూడిన నగదు ఎవరి దగ్గరా సిద్ధంగా లేకపోవడంతో.. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్త నోట్లు ఇంకా పెద్దమొత్తంలో ఎవరికీ అందుబాటులో లేవు.నిజానికి ఏ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలన్నా బ్యాంకులు దాని విలువ మొత్తానికి రుణం మంజూరు చేయవు. తప్పనిసరిగా కొంత మొత్తాన్ని సేవింగ్స్ లోంచి తీయాల్సిందే. ఇప్పుడు అలా తీయడానికి కూడా పరిమితులు ఉండటం, వారానికి రూ. 24 వేలకు మించి విత్డ్రా చేయడానికి వీల్లేకపోవడంతో అసలు ఇళ్లు/ఫ్లాట్లు కొనేవాళ్లు కనిపించడంలేదు.
ఈ పరిస్థితి పెట్టుబడిదారులతో పాటు బిల్డర్లలో కూడా తీవ్ర అయోమయం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ధరలు తగ్గగా.. రాబోయే ఆరేడు నెలల్లో మరింత పతనం కావడం ఖాయమని అంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతకుముందు కంటే 25-30 శాతం తగ్గినట్లు జాతీయ రియల్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు తరుణ్ భాటియా తెలిపారు. ఇంతకుముందు జరిగిన ఒప్పందాలు కూడా రద్దవుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో ఒక బంగ్లాకు ఇంతకుముందు రూ. 3.25 కోట్ల ధర పలకగా, ఒక్కసారిగా అది 2.25 కోట్ల రూపాయలకు పడిపోయిందని, మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉందని భాటియా చెప్పారు.
పెద్ద బడ్జెట్తో ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారే ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా ఇతర ప్రాంతాల కంటే ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లకు చెందినవాళ్లకు సమస్య మరీ ఎక్కువగా ఉందని ఫిచ్ అనే రేటింగ్ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఇక్కడ రేట్లు తగ్గడంతో పాటు లావాదేవీల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని, దీని ప్రభావం పలు రంగాలపై పడుతుందని అంటున్నారు.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..







