మరో రాజకీయ నేపధ్య సినిమా తీయనున్న మణి రత్నం

- November 16, 2016 , by Maagulf
మరో రాజకీయ నేపధ్య సినిమా తీయనున్న మణి రత్నం

ఎలాంటి కథతోనైనా మేజిక్‌ చేయగల సమర్థుడు మణిరత్నం. సెల్యులాయిడ్‌ వేదికగా చేసుకొని ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఏ జోనర్‌ కథని తెరకెక్కించినా అందులో తనదైన మార్క్‌ని జోడించి ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆయన దృష్టి మరోసారి రాజకీయాలపై పడిందని సమాచారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, కరుణానిధిల స్ఫూర్తితో ఆయన తీసిన 'ఇద్దరు' అప్పట్లో విశేష ఆదరణని సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆ తరహాలోనే మరోసారి రాజకీయ నేపథ్యమున్న చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. 'ప్రతిపక్షం' అనే అర్థం వచ్చే పేరుతో తమిళంలో ఆయన ఓ చిత్రం తెరకెక్కించనున్నట్టు సమాచారం.
అందులో ఓ యువ కథానాయకుడు ముఖ్య భూమిక పోషిస్తారని తెలిసింది. తమిళంలో తెరకెక్కుతోందంటే అది తెలుగులో విడుదలవడమూ తప్పనిసరి. ప్రస్తుతం కార్తి కథానాయకుడిగా 'డ్యూయెట్‌' అనే సినిమాని చేస్తున్నారు మణిరత్నం. ఆ చిత్రం విడుదలయ్యాకే కొత్త సినిమా కబుర్లు అధికారికంగా బయటికొచ్చే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com