కతర్ లో నీటిని,విద్యుత్ ను వృధా చేసేవారికి 20,000రియాల్స్ జరిమానా
- November 16, 2016
దేశవ్యాప్తంగా పారిశ్రామిక, వాణిజ్య మరియు నివాస సౌకర్యాలు వద్ద విద్యుత్ మరియు నీటి వృథా అవుతున్నాయిని వాటి నిషేధానికి త్రశీద్ చట్టం అమలు పరచే ప్రయత్నం జరుగుతుంది, కతర్ జనరల్ విద్యుత్ మరియు అగ్ని కార్పొరేషన్ కాహారమా భారీ తనిఖీ కార్యక్రమమును చేపట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తనిఖీల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ప్రసారాన్ని కాహారమా శక్తి సామర్థ్య కార్యక్రమ తర్షీద్ పెంచడానికి ప్రారంభించింది. పరిరక్షణ మరియు శక్తి సమర్థత జాతీయ కార్యక్రమం (తర్షీద్ ) లీగల్ పర్యవేక్షణ విభాగం మంగళవారం కాహారమా.లైవ్ ' అకౌంట్ కింద స్నాప్ఛాట్ లో ఒక వీడియోను ప్రసారం చేసింది.
తర్షీద్ న్యాయ పర్యవేక్షణ విభాగపు ముఖ్యులు ఫాహ్డ్ అల్ హంజాబ్ మాట్లాడుతూ, న్యాయ అధికారాలు ఇన్స్పెక్టర్లు చట్టం సంఖ్య ౨౦, 2016 వివరించారు. దీని ప్రకారం తాగునీటితో వాహనాల బాహ్య భాగాలను కడగడం నిషేధించారు. ఈ చట్టం ప్రకారం, భవనాల వెలుపల వెలిగే లైట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4:౩౦ వరకు వెలగరాదని ఆ సమయంలో లైట్లు వెలిగితే ఒక దండన తప్పదని పేర్కొన్నారు. అలాగే నీటి కుళాయిల హెడ్డులని కట్టివేయక నీటిని వృధా చేస్తే అందుకు సైతం చట్టం యొక్క ఉల్లంఘన నేరం కింద పరిగణించి జరిమానాలు విధిస్తారు. పైపు కట్టకపోవడం ద్వారా నీటి వృధా చేస్తే అందుకు తొలి తప్పుగా జరిమానా 20,000 క్యూ ఆర్ ఉంటుందని ,అదేవిధంగా విద్యుత్ ని వృధా చేస్తే 10,000 క్యూ ఆర్ జరిమానాలతో శిక్షింపబడతారని అల్ హంజాబ్ వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







