ప్రముఖ వేణుగాన విద్వాంసుడుకు జీవితసాఫల్య పురస్కారం
- November 18, 2016
ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాకు శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేసినందుకు గాను జీవితసాఫల్య పురస్కారం లభించింది. ఉత్తరభారతదేశంలో కథక్, హిందూస్తానీ సంగీత వ్యాప్తికి కృషి చేసిన సుమిత్రా చరత్ రామ్ పేరిట 15 ఏళ్లుగా అవార్డులను అందజేస్తున్నారు. సుమిత్ర శ్రీరామ్ భారతీయ కళా కేంద్రం వ్యవస్థాపకురాలు. ఆమె కృషికి గుర్తుగా నృత్యం, సంగీతం విభాగాల్లో వ్యక్తిగతంగా ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను అందజేస్తుంటారు.
2016 సంవత్సరానికి గాను.. .
పద్మవిభూషణ్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా 2016 సంవత్సరానికిగాను సుమిత్ర చరత్ రామ్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
న్యూదిల్లీలోని కామని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతులమీదుగా చౌరాసియా పురస్కారం స్వీకరించారు. సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శేఖర్ సేన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువను, ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీరామ్ భారతీయ కళా కేంద్రం డైరెక్టర్, వైస్ ఛైర్పర్సన్ శోభా దీపక్ సింగ్ అన్నారు. పురస్కారం కింద అభినందన పత్రం, శాలువా, వెండి పతకం అందజేసినట్లు ఆమె తెలిపారు.
గతంలో ఈ పురస్కారం అందుకున్నవారిలో.. పండిట్ బిర్జు మహారాజ్(కథక్), కిషోరి అమోంకర్(హిందూస్థానీ వోకల్), మాయాధర్ రౌత్(ఒడిస్సీ), పండిట్ జస్రాజ్(హిందూస్థానీ వోకల్), కుముదిని లఖియా(కథక్) ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!! దుబాయ్: పాదచారుల భద్రతను మరింత మెరుగుపర�
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







