వలసదారులపై జరీమానాలు పెరుగుతున్న ఆందోళన
- November 18, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, తదుపరి జాతీయ అసెంబ్లీలో కీలకమైన అంశాలకు మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 'ఓవర్ స్టే' చేస్తున్నవారిపై రోజుకి 2 కువైట్ దిర్హామ్స్ జరీమానా విధిస్తున్నారు. దీన్ని డబుల్ చేయడం అంటే 4 కువైట్ దినార్స్కి పెంచేలా నిర్ణయం జాతీయ అసెంబ్లీ ద్వారా వెలువడనుందని సమాచారమ్. అలాగే మేగ్జిమమ్ జరీమానా లిమిట్ ప్రస్తుతం 600 కువైట్ దిర్హామ్స్ ఉండగా, దాన్ని 1000కి పెంచవచ్చుననే ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారులు ఎవరూ ఈ అంశాలపై స్పష్టతనివ్వడంలేదు. తమ పిల్లలు లేదా భాగస్వామికి స్పాన్సర్ చేయడం కోసం సేలరీ కేప్ని 250 కువైట్ దిర్హామ్స్ నుంచి 450 కువైట్ దిర్హామ్స్ వరకు పెంచారు. ఇది ఇంకా పెరగవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా దేశంలో వలసదారుల వర్క్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశ్యం దిగా ఉంది. ప్రస్తుతం కువైట్లో 1.3 మిలియన్ నేటివ్ సిటిజన్స్ ఉండగా 3 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. ఇందులోనూ ఆసియన్ల సంఖ్య చాలా ఎక్కువ. 1 మిలియన్ మంది భారతీయులే ఇందులో ఉన్నారు. 650,000 మంది డొమెస్టిక్ హెల్పర్స్ వారిలో ఎక్కువగా మహిళలు వలసదారులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







