వలసదారులపై జరీమానాలు పెరుగుతున్న ఆందోళన

- November 18, 2016 , by Maagulf
వలసదారులపై జరీమానాలు పెరుగుతున్న ఆందోళన

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, తదుపరి జాతీయ అసెంబ్లీలో కీలకమైన అంశాలకు మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 'ఓవర్‌ స్టే' చేస్తున్నవారిపై రోజుకి 2 కువైట్‌ దిర్హామ్స్‌ జరీమానా విధిస్తున్నారు. దీన్ని డబుల్‌ చేయడం అంటే 4 కువైట్‌ దినార్స్‌కి పెంచేలా నిర్ణయం జాతీయ అసెంబ్లీ ద్వారా వెలువడనుందని సమాచారమ్‌. అలాగే మేగ్జిమమ్‌ జరీమానా లిమిట్‌ ప్రస్తుతం 600 కువైట్‌ దిర్హామ్స్‌ ఉండగా, దాన్ని 1000కి పెంచవచ్చుననే ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారులు ఎవరూ ఈ అంశాలపై స్పష్టతనివ్వడంలేదు. తమ పిల్లలు లేదా భాగస్వామికి స్పాన్సర్‌ చేయడం కోసం సేలరీ కేప్‌ని 250 కువైట్‌ దిర్హామ్స్‌ నుంచి 450 కువైట్‌ దిర్హామ్స్‌ వరకు పెంచారు. ఇది ఇంకా పెరగవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా దేశంలో వలసదారుల వర్క్‌ ఫోర్స్‌ని బ్యాలెన్స్‌ చేయాలనే ఉద్దేశ్యం దిగా ఉంది. ప్రస్తుతం కువైట్‌లో 1.3 మిలియన్‌ నేటివ్‌ సిటిజన్స్‌ ఉండగా 3 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. ఇందులోనూ ఆసియన్ల సంఖ్య చాలా ఎక్కువ. 1 మిలియన్‌ మంది భారతీయులే ఇందులో ఉన్నారు. 650,000 మంది డొమెస్టిక్‌ హెల్పర్స్‌ వారిలో ఎక్కువగా మహిళలు వలసదారులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com