డయాబెటిస్పై అవగాహన: వేలాదిమంది హాజరు
- November 18, 2016
దుబాయ్లో డయాబెటిస్పై అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొన్నారు. 3.8 కిలోమీటర్ల మేర ప్రజలు డయాబెటిస్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవగాహనతో డయాబెటిక్ సమస్యలు తగ్గుతాయనీ, ఆరోగ్యకరమైన జీవితం డయాబెటిస్ని దూరం చేస్తుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు చెప్పారు. అవగాహనా కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కియోస్క్లో బ్లడ్ గ్లూకోజ్ టెస్టింగ్ సౌకర్యాన్ని పలువురు వినియోగించుకున్నారు. జుంబా మరియు యోగా ఫిట్నెస్ సెషన్స్, అలాగే స్పాట్ డాన్స్ వంటివి ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూఏఈలో ప్రధానంగా ప్రజల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముఖ్యమైనది. దీన్ని ఎదుర్కొనేందుకు పలు అవేర్నెస్ ఈవెంట్లు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.






తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







