ఆటతోపాటే వివాదాలతోనూ గుత్తాజ్వాల....
- November 18, 2016
ఆటతోపాటే వివాదాలతోనూ మీడియాకెక్కుతుంటుంది బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల. తాజాగా ఒలింపిక్స్లో పతకం సాధించిన సింధు గురించి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి జ్వాల మాట్లాడింది. సింధుకు, సానియాకు దొరికిన సపోర్ట్ తనకు దక్కలేదని జ్వాల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 'ఇప్పటి వరకు నేను ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదు. ఎలాంటి అవార్డులనూ ఆశించలేదు. మొన్న సింధు ఒలింపిక్ పతకం గెలిచాక 'వాళ్ల కుటుంబం అంత కష్టపడింది. వాళ్ల నాన్నగారు ఎన్నో త్యాగాలు చేశారు' అంటున్నారు. సింధు వాళ్ల కుటుంబం కష్టపడింది. అందులో డౌట్ లేదు. అయితే ఓ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అంతే కష్టపడతారు. కానీ సింధుకి దొరికిన సపోర్ట్ నాకెక్కడిది.సానియాకు కూడా సపోర్ట్ దొరికింది. ఇలాంటివి మాట్లాడకూడదు. నేను ఫేమస్ అయ్యానంటే అది కేవలం నా ఆటతోనే. నాకెవరూ సపోర్ట్ చేయలేద'ని చెప్పుకొచ్చింది జ్వాల. అలాగే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ డబుల్స్ను సపోర్ట్ చేయరని, అంతే తప్ప అతనితో తనకెలాంటి ఇబ్బందులూ లేవని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







