భారతదేశంలో రైలు ప్రమాద మరణాల పట్ల సంతాపం వ్యక్తం
- November 21, 2016మనామా : బహ్రేయినీ నాయకత్వం భారతదేశంలోని ఆదివారం ఉత్తరప్రదేశ రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపంవ్యక్తం చేశారు. మెజెస్టి కింగ్ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా రైలుప్రమాదంలో మరణించిన బాధితుల గూర్చి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తమ సంతాపం ప్రకటించారు.ఎడబాటుకు గురైనవారి బాధితుల కుటుంబాలకు ఓదార్పు మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మెజెస్టి కింగ్ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా భావించారు. విషాద ఘట్టంలో భారతదేశానికి ప్రతికూలంగా ఉంటుందని ఈ సమయంలో బహరేన్ తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని పునరుద్ఘాటించారు.ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రమాదం గూర్చి భారతదేశ అధ్యక్షుడికి ముఖర్జీకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, భారత ప్రధాని నరేంద్ర మోడీకి తన సంతాపం ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులు వేగవంతంగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీ శ్రీ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా అధ్యక్షుడు ముఖర్జీకి తమ సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు