పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 145కి చేరిన మృతుల సంఖ్య
- November 21, 2016
కాన్పూర్ సమీపంలో ఇండోర్, పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 145కు చేరింది. మృతుల్లో 123 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. 110 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది ఈ విచారణలో తేలుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాద ఘటన తర్వాత తీసుకున్న సహాయక చర్యలపై ఆయన లోక్ సభలో ప్రకటన చేశారు.
.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







