పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 145కి చేరిన మృతుల సంఖ్య

- November 21, 2016 , by Maagulf
పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 145కి చేరిన మృతుల సంఖ్య

కాన్పూర్ సమీపంలో ఇండోర్, పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 145కు చేరింది.  మృతుల్లో 123 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. 110 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు.  ప్రమాదానికి కారణం ఏమిటనేది ఈ విచారణలో తేలుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాద ఘటన తర్వాత తీసుకున్న సహాయక చర్యలపై ఆయన లోక్ సభలో ప్రకటన చేశారు. 

.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com