'స్పైస్ జెట్' వారి స్పెషల్ ఆఫర్
- November 21, 2016
దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఒకవైపు ప్రారంభ చార్జీ రూ.737గా పేర్కొంది. నేటి నుంచి ఈనెల 24 అర్ధరాత్రి వరకు ఈ పథకం టికెట్లను విక్రయించనున్నట్టు సంస్థ పేర్కొంది. టికెట్లు కొనుగోలు చేసిన వారు జనవరి, 9వ తేదీ నుంచి 28 అక్టోబరు 2017 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్ము- శ్రీనగర్-జమ్ము, చండీగఢ్-శ్రీనగర్-చండీగఢ్, అగర్తలా-గువాహటి మధ్య రూ.737 ప్రారంభ టికెట్ల ధరతో ప్రయాణించ వచ్చని వివరించింది.నాన్స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, దూరాలను బట్టి ధరలో తేడా ఉండొచ్చని స్పైస్జెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







