'స్పైస్ జెట్' వారి స్పెషల్ ఆఫర్
- November 21, 2016
దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఒకవైపు ప్రారంభ చార్జీ రూ.737గా పేర్కొంది. నేటి నుంచి ఈనెల 24 అర్ధరాత్రి వరకు ఈ పథకం టికెట్లను విక్రయించనున్నట్టు సంస్థ పేర్కొంది. టికెట్లు కొనుగోలు చేసిన వారు జనవరి, 9వ తేదీ నుంచి 28 అక్టోబరు 2017 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్ము- శ్రీనగర్-జమ్ము, చండీగఢ్-శ్రీనగర్-చండీగఢ్, అగర్తలా-గువాహటి మధ్య రూ.737 ప్రారంభ టికెట్ల ధరతో ప్రయాణించ వచ్చని వివరించింది.నాన్స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, దూరాలను బట్టి ధరలో తేడా ఉండొచ్చని స్పైస్జెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









