'స్పైస్ జెట్' వారి స్పెషల్ ఆఫర్

- November 21, 2016 , by Maagulf
'స్పైస్ జెట్' వారి స్పెషల్ ఆఫర్

దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఒకవైపు ప్రారంభ చార్జీ రూ.737గా పేర్కొంది. నేటి నుంచి ఈనెల 24 అర్ధరాత్రి వరకు ఈ పథకం టికెట్లను విక్రయించనున్నట్టు సంస్థ పేర్కొంది. టికెట్లు కొనుగోలు చేసిన వారు జనవరి, 9వ తేదీ నుంచి 28 అక్టోబరు 2017 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్ము- శ్రీనగర్-జమ్ము, చండీగఢ్-శ్రీనగర్-చండీగఢ్, అగర్తలా-గువాహటి మధ్య రూ.737 ప్రారంభ టికెట్ల ధరతో ప్రయాణించ వచ్చని వివరించింది.నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, దూరాలను బట్టి ధరలో తేడా ఉండొచ్చని స్పైస్‌జెట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com